విశాఖ: నగరంలో 79 కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

72చూసినవారు
విశాఖ: నగరంలో 79 కేసులున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
విశాఖనగరంలో అంతరాష్ట్ర దొంగను పట్టుకుని చోరీ సొత్తుని స్వాధీనం చేశామని విశాఖ క్రైమ్ అడిషనల్ సీపీ మోహన్ రావు
 బుధవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే మధురానగర్ మాధవ టవర్స్ లో మార్చి 1 వ తేదీన జరిగిన చోరీలో హైదరాబాదుకు చెందిన తిప్పరాజు రామకృష్ణను అరెస్టు చేసామని తెలిపారు.  అతని వద్ద నుంచి రూ. 3.70లక్షల నగదు స్వాధీనం చేసుకోగా మరో 13 తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందన్నారు. అతనిపై ఇప్పటివరకు 79 కేసులు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్