ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ -2025 పోటీలకు జ్యోతి యర్రాజి ఎంపికైనట్లు విశాఖపట్నం అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నారాయణ తెలిపారు. విశాఖ నగరానికి చెందిన ఒలింపియన్ జ్యోతి ఎర్రాజి ఇండియా నుంచి పాల్గొననున్నట్లు వెల్లడించారు. కొరియాలో గల గుమిలో ఈనెల 27 నుంచి 31 వరకు ఈ పోటీలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.