విశాఖపట్నం మాధవధార ఈస్ట్ పార్క్ లో మహిళా వాల్కేర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీ లు నిర్వహించారు. పోటీలో గెలిచిన మహిళలు కు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్య అతిథిగా డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.