విశాఖలో ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం ఏసీ హెల్మెట్లు అందజేశారు. ఈ హెల్మెట్లు 4 గంటలు ఛార్జింగ్ పెడితే 8 గంటల పాటు పనిచేస్తాయని వివరించారు. దాతల సహాయంతో 30 మందికి ఏసీ హెల్మెట్లు, 40 మందికి కూలింగ్ జాకెట్లు అందజేశారు. వీటిని ధరించిన తర్వాత 8 నుంచి 10 డిగ్రీల వరకు శరీర ఉష్ణోగ్రత తగ్గి సిబ్బందికి ఉపశమనం కలుగుతుందన్నారు