సముద్రంపై వేట సాగించే మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఆర్థిక పండగ చేయనుంది. తాము అధికారంలోకి వస్తే.. సముద్రంలో చేపల వేటపై నిషేధ సమయంలో ఇస్తున్న పరిహారాన్ని రెట్టింపు చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో వేట నిషేధ కాలం పూర్తయిన తర్వాత మత్స్యకారులకు పరిహారాన్ని అందజేసేవారు. కానీ ఈ ఏడాది ముందుగానే పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు.