అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామంలో ధనుర్మాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం ఈ వేడుకల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఆలయంలో సీతారామచంద్రులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. రోజు నిర్వహిస్తున్న మేలుకొలుపు కార్యక్రమంలో పాల్గొంటున్న భజన బృంద సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు.