అచ్యుతాపురం: సెల్‌ టవర్‌ ఎక్కి రైతు ఆందోళన

82చూసినవారు
అచ్యుతాపురం: సెల్‌ టవర్‌ ఎక్కి రైతు ఆందోళన
అనకాపల్లి జిల్లాలో గురువారం రైతు ఆందోళన చేపట్టాడు. అచ్యుతాపురం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగాడు. సెల్ టవర్ ఎక్కి, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ సమస్యపై సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. రైతును కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్