కూటమి ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రాంబిల్లి మండలం గురజాపాలెంలో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ. 13. 17 కోట్ల వ్యయంతో పార్కును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.