ప్రస్తుత సమాజాన్ని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత చాలా అవసరమని వైద్య అధికారిణి లిఖిత పిలుపునిచ్చారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ చికిత్సలో వ్యాధిని ముందుగా గుర్తించడం, తగిన సమయం లో చికిత్స తీసుకోవడం, మానసిక ప్రేరణ అనేది చాలా అవసరమని అధికారిణి లిఖిత అన్నారు.