యలమంచిలి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడిగా మంగళవారం ఇత్తంశెట్టి సన్యాసినాయుడు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా గంజి శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. మంగళవారం అచ్యుతాపురంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు సమక్షంలో మండల కమిటీ ఎన్నిక జరిగింది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కొత్త కమిటీ పనిచేయాలని నాగేశ్వరావు సూచించారు.