ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల అసోసియేషన్ వార్నింగ్

63చూసినవారు
ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్ల అసోసియేషన్ వార్నింగ్
ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో వారిలో ఆందోళన నెలకొంది. కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తోందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఈశ్వరయ్య మండిపడ్డారు. వచ్చే నెల 2 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. తదుపరి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్