AP: ఎస్వీ గోశాలలో ఆవులు మృతి చెందాయనే వార్తలతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రోజా డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసినప్పుడు.. విజయవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కళ్యాణ్, గోవులు చనిపోతే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇప్పుడు తిరుమలలో అపచారాలు, ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు.