టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో గన్నవరం వైసీసీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వంశీ అరెస్ట్పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తాజాగా స్పందించారు. గన్నవరం కుక్కను ఇప్పుడే బోనులో వేశామని, మిగిలిన కుక్కలను త్వరలోనే బోనులో వేస్తామని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లను ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, నేరం చేసిన వాళ్లు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.