ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం తిరుపతిలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 24 లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఏపీలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, ఇప్పటికే ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని, 4,741కి.మీ వరకు రహదారులను నిర్మించామని తెలిపారు.