AP: టెంపుల్ టూరిజంలో భాగంగా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఒంటిమిట్టలో చంద్రబాబు మాట్లాడుతూ.. "ఆలయం పక్కనే ఉన్న చెరువు బ్యూటిఫికేషన్ పనులను ప్రారంభించాం. ఇక్కడికి ఎవరు వచ్చినా రెండు మూడు రోజలు ఉండేలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. దేవాలయాలు మన వారసత్వ సంపద. దేవాలయాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు." అని అన్నారు.