పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా హంద్రీనీవా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదని అన్నారు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చేవరకు తమతోనే ఉంటానని హామీచ్చారు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని పేర్కొన్నారు.