పోడూరు మండలం సచివాలయ పరిధిలో 11 నుండి 18 సంవత్సరాల కిశోర బాలికలకు ఐసిడిఎస్ సిడిపిఓ సిహెచ్ ఇందిరా ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు శుక్రవారం నిర్వహించరు. ప్రాజెక్ట్ డైరెక్టర్ బి సుజాత రాణి పాల్గొని బాల్య వివాహాల ప్రమాదాలు, 18 సంవత్సరాలు అమ్మాయిలకు, 21 సంవత్సరాలు అబ్బాయిలకు పెళ్లి చేయాలని చట్టం వివరించారు. బాల్య వివాహాలు నిషేధించబడ్డాయని, మైనర్ వివాహం చేసిన వారికి జైలు శిక్ష, జరిమానా విధించబడుతుందని చెప్పారు.