రాజ్యాంగాన్ని తూట్లు పొడిస్తుంది బిజెపినేనని, రాజ్యాంగాన్ని కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారామ్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ హయాంలోనే 100ఎమర్జెన్సీలు వస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల ఓర్వలేక కాంగ్రెస్ పైవిమర్శలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీపైవిమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.