భీమవరం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కూటమి సునామీ సృష్టించిందని అన్నారు. అదే విధంగా కూటమి అధికారంతో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు.