పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. 4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లష్టర్లు ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూలంగా ఉండాలన్నారు. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సంప్రదింపులు జరిపారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని పరిశ్రమల శాఖ అధికారులను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.