కనకాయలంక, పెదలంక గ్రామాలలో జిల్లా కలెక్టర్ పర్యటన

65చూసినవారు
గోదావరి వరద తాకిడికి గురైన యలమంచిలి మండలంలోని కనకాయలంక, పెదలంక గ్రామాలలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం పర్యటించారు. లంక ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణించి, స్థానికంగా ఉన్న పరిస్థితులను, వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంట నష్టంపై ఆరా తీశారు. నరసాపురం ఆర్డీవో యం. అచ్యుత్ అంబరీష్, యలమంచిలి తాహసిల్దార్ సి. హెచ్ విజయశ్రీ, ఎంపీడీవో పి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్