ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదతో బుధవారం గోదావరి నీటిమట్టం పెరిగింది. ఎలమంచిలి మండలంలోని బాడవ, చించినాడ, యలమంచిలి, యలమంచిలిలంక, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల పుష్కర ఘాట్ల వద్ద సుమారు రెండు అడుగుల మేర వరద నీరు పెరిగింది. అలాగే కనకాయలంక కాజ్వేపైకి నీరొచ్చే ప్రమాదం ఉండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.