తల్లి పాలు బిడ్డకు సంజీవని వంటివని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి సూర్యనారాయణమూర్తి అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గురువారం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. బిడ్డకు
జన్మనిచ్చిన అరగంటలోపు తల్లిపాలు పట్టించాలన్నారు. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.