తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి నివాసాలకు వెళ్లిన రాధాకృష్ణ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల కుటుంబాలకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.