పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన బాలిక అదృశ్యం కావడంతో మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె. వెంకటరమణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. గ్రామంలోని ఓ బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అతడిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.