దేశ సరిహద్దులలో వీరోచితంగా పోరాడుతున్న వీర సైనికులకు విజయం చేకూరాలని ఆచంట మండల బీజేపీ ఆధ్వర్యంలో ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, దేశ భద్రత పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం సఫలీకృతం కావాలని రామేశ్వర స్వామి వారిని వేడుకొన్నారు. ఈ కార్యక్రమం లో నేదునూరి శ్రీనుబాబు, ముచ్చర్ల నాగసుబ్బారావు, కో కన్వీనర్ కొత్త భాస్కర నాగభూషణం, కూటమి నాయకులు పాల్గొన్నారు.