మన దేశ సరిహద్దుల లో వీరోచితంగా పోరాడుతున్న వీర సైనికులకు విజయం చేకూర్చాలని ఆచంట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆచంట శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని, దేశ భద్రత పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం సఫలీకృతం కావాలని రామేశ్వర స్వామి వారిని వేడుకొన్నారు.