కేంద్ర విమానయ శాఖ మంత్రి కించరపు రామ్మోహన్ నాయుడుకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి యంగ్ గ్లోబల్ లీడర్ 2025 గా గుర్తింపు లభించడం పట్ల రాష్ట్ర మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గురువారం మాట్లాడుతూ తెలుగు వ్యక్తికి ఈ స్థాయిలో అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణం అన్నారు. ఇది కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికే గౌరవించదగిన సందర్భమన్నారు.