పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు గురువారం పెనుగొండలో రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో టి సూర్యనారాయణ మూర్తి, పంచాయితీ సిబ్బంది రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సొసైటీకి రక్తదానం చేశారు. సందర్భంగా ఎంపీడీవో సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడవచ్చు అని తెలిపారు.