పెనుగొండ గోంగూర తూము (రాజీవ్ సర్కిల్) వద్ద గల మండల ప్రజా పరిషత్ కి పాఠశాల ముందు భాగంలో ఉండే గేటు సగభాగం సంవత్సరం క్రితం కూలిపోయింది. దీంతో స్కూల్ లో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిలు మద్య సేవిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి ఇప్పటికైనా పాఠశాలకు గేటు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం అన్నారు.