పోడూరు ప్రాథమిక వైద్యఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం నరసాపురం డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో డాక్టర్ ప్రసాదు సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్యసేవలను, మందుల పంపిణీని పరిశీలించారు. వివిధ రకాల నిర్వాహణా రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో గర్భిణుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆలా్ట్రసౌండ్ స్కానింగ్ మిషన్ను ఆయన పరిశీలించారు. మిషన్ను నిర్వహించే గైనకాలజిస్టు పోస్టు లేదని సిబ్బంది తెలిపారు.