ఏలూరు జిల్లాలో జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు శనివారం ర్యాలీ జరిగింది. మీడియా గొంతు నొక్కే యత్నాలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన అని నినాదాలు చేశారు. రెండో పట్టణ సీఐ అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.