పెనుమంట్ర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామానికి చెందిన గోపరాజు మారుతీ కృష్ణ నియమించబడ్డారు. జిల్లా రిటర్నింగ్, ఏఆర్ ఓ ఆదేశాలతో మారుతీ కృష్ణను అధ్యక్షునిగా ఎంపికచేయడం జరిగిందని, ఆచంట అసెంబ్లీ కన్వీనర్ ప్రసాద్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా శనివారం తెలియచేసారు. ఈ సందర్భంగా మారుతీ కృష్ణకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు అభినందనలు తెలియచేసారు.