పెనుగొండ క్షేత్రంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని నవగ్రహాలయంలో శ్రీశనీశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వకంగా తైలాభిషేకము, పంచామృత, ఫలరస సుగంధ ద్రవ్య అభిషేకం, అర్చనల అనంతరం స్వామివారి దర్శనము ఆలయ అర్చకులచే వేడుకగా నిర్వహించారు.