ప. గో. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెనుగొండ మండలం సిద్దాంతంలో పోలీసులు గురువారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న రూ. 1,40,000 విలువైన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. దీంతో విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించగా నిందితులపై కేసు నమోదు చేసి బియ్యాన్ని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ ఈ. శివరామకృష్ణ, సీఎస్ఆర్ఐ సత్యనారాయణ ఉన్నారు.