పెనుగొండ మండలంలోని పెనుగొండ, తామరాడ, సిద్ధాంతం, దొంగరావిపాలెం, రామన్నపాలెం తదితర గ్రామాలలో చెట్టుకొమ్మలు తొలిగింపు కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ మధుకుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు విద్యుత్ సరఫరా ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.