పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలోని శివరావుపేటలోని అంగన్వాడీ కేంద్రంలో మదర్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పిల్లలు వారి తల్లులకు కాళ్ళు కడిగి ఆశీర్వచనం తీసుకోగా అంగన్వాడీ సిబ్బంది చేతులు మీదుగా తల్లులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పోచమ్మ, టీచర్లు సరస్వతి, భాగ్యలక్ష్మి ఆయా పాల్గొన్నారు.