పెనుమంట్ర మండలంలో తరచూ చోరీలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాముడూరులో వరుసగా మూడు ద్విచక్ర వాహనాలు మాయమయ్యాయి. ఐదు రోజుల కిందట పొలమూరులో ఇంటి ముందు ఉంచిన వాహనం, గురువారం రాత్రి వెలగలేరు, పొలమూరు గ్రామాల్లో రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టాలని కోరుతున్నారు.