పోడూరు మండలం లో శుక్రవారం మధ్యాహ్నం భారీగా ఈదురు గాలులు వీచడం తోపాటు, ఆకాశం పూర్తిగా మబ్బులు కమ్మేసి, మేఘావృతమయ్యింది. మండల కేంద్రం పోడూరు, మంగలిపాలెం, కవిటం, జగన్నాథపురం, పండిత విల్లూరు, తూర్పుపాలెం, జున్నూరు, , వేడంగి తదితర అన్ని గ్రామాలలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఈదురు గాలులు దాటికి వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు.