జమ్మూ కశ్మీర్ లో పాకిస్తాన్ పై భారత త్రివిధ దళాల ఆర్మీ యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మీకి ప్రాణనష్టం జరగకుండా, ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని పెనుగొండ మండల బీజేపీ అధ్యక్షుడు దొడ్డిపట్ల నాగూర్ ఆధ్వర్యంలో కొఠాలపర్రులో శ్రీ కేశవ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.