భారతదేశ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమవరం అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం ఒక న్యాయవాదిగానో, రాజ్యాంగ నిర్మాతగానో మాత్రమే కాకుండా ఒక గొప్ప సంఘ సంస్కర్తగా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిపోయారన్నారు.