పల్లె పండుగ కార్యక్రమాలతో గ్రామాలలో ఎంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం దిరుసుమర్రులో 4 పశువుల షెడ్ లను, వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో పల్లె పండుగ పశువుల షెడ్ ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అబివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతామని అన్నారు.