భీమవరం త్యాగరాజ భవనంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం శాకాంబరీ దేవిగా అలంకరించారు. ఆర్యవైశ్య వర్తక సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ కూరగాయలు, పండ్లు, ఆకులతో అమ్మవారిని అలంకరించారు.