కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ ప్రమాణం చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సింధూర్ మొక్కను నాటారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్లకు స్మరణార్థంగా, ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా ఈ మొక్కను నాటినట్లు ఆయన తెలిపారు.