భీమవరం కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య సర్వే అధికారులతో సమావేశమై పలు అంశాలపై మంగళవారం సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవేస్ భూ సేకరణలో భాగంగా ఆయా భూముల్లో ఉన్న ఇళ్ళు, షెడ్లు, చెట్లు వంటి వాటిని కచ్చితంగా లెక్కించాలన్నారు. సర్వేపై అందుతున్న ఫిర్యాదులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. మనం చేసే పనిలో ప్రజల నమ్మకం కోల్పోకూడదని సూచించారు.