టి -20 క్రికెట్ ప్రపంచ చాంపియన్ గా విజయం సాధించిన భారత టీంపై హర్షాతిరేకాలు తెలియజేస్తూ భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు, క్రీడ సంస్థలతో సంబరాలను నిర్వహించారు. ఆంధ్ర శేఖర్ రాజు మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన టి -20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సౌత్ఆఫ్రికా పై భారత్ ఘన విజయం సాధించిందన్నారు.