విద్యపై అవగాహన లేక తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టీ ధనార్జన చేయడం వారి భవిష్యత్ ను తుంగలో తొక్కటమేనని, ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెరుకువాడ రంగసాయి, నరహరిశెట్టి కృష్ణ అన్నారు. గునుపూడిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం బడికి పోదాం రా కార్యక్రమాన్ని నిర్వహించి హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు.