వీరవాసరంలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను గురువారం నిర్వహిస్తున్నట్లు ఏఈ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీజీఆర్ఎస్, ఏపీ ఈపీడీసీఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పరిష్కార వేదికలో వినియోగదారుల సమస్యలను తెలుసుకుని అక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఉదయం 10 గంటలకు ఈ వేదిక ప్రారంభమవుతుదన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.