ఖరీఫ్ వరినాట్లు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య ఆదేశించారు. సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటలు నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్ భారీన పడకుండా సాగు త్వరగా ప్రారంభించి పూర్తి వేసేలా రైతులను సన్నద్దం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ వరిసాగు లక్ష్యాన్ని 86, 831 హెక్టార్లుగా నిర్ణయించామని తెలిపారు.