భీమవరంలోని కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్ష కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్లంతా లక్ష్యాలను చేరుకోవడం చాలా ముఖ్యమని వివిధ వర్గాల ప్రజలకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కలిగించామనేది ఆలోచించాలని, కౌలు రైతులకు అందించే సీసీఆర్సీ కార్డులకు సంబంధించి రుణాల మంజూరులో అర్హులైన ప్రతిఒక్కరికి రుణాలు అందించాలన్నారు.